అజ్ఞాన చీకటిలో విజ్ఞాన జ్యోతి – మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
రామగుండం: టెమ్రీస్ రామగుండం–బయాస్–1లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ విద్యా దినోత్సవం మరియు 137వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమాత్–ఇ–ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్, టెమ్రీస్ కౌన్సిలర్, హింద్ మజ్దూర్ సభ (HMS) జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పాల్గొన్నారు.
మౌలానా ఆజాద్ అల్-హిలాల్, అల్-బలాగ్, లిసాన్ అల్-సద్దిక్, అల్-మిస్బా వంటి పత్రికలకు ఎడిటర్గా పనిచేశారు. ఆయన రచనలు తజ్కిరా, ఇస్లాంలో స్వేచ్ఛ భావన, హయాత్ సర్మాద్, ఖలీఫా సమస్య, ఉమ్ అల్-కితాబ్ వంటి పుస్తకాల రూపంలో వెలువడ్డాయి.
కార్యక్రమంలో టెమ్రీస్ కౌన్సిలర్ ఐషా సిద్దిఖా, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, కాంగ్రెస్ నాయకుడు ఆసిఫ్, మైనార్టీ నాయకుడు అబ్దుల్ సత్తార్, జమాత్–ఇ–ఇస్లామీ హింద్ గోదావరిఖని నాయకుడు ముస్తఫా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ వారికి బహుమతులు, మొమెంటోలు అందజేశారు. ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ దంపతులకు బొకేలు, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, “తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బందికి ఎల్లప్పుడూ కౌన్సిలింగ్ అందిస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్లకు కృతజ్ఞతలు” తెలిపారు.
విద్యా విలువలను ప్రతిబింబించే ఈ కార్యక్రమం అజ్ఞాన చీకటిలో విజ్ఞాన జ్యోతి వెలిగించిన మౌలానా ఆజాద్కి అంకితం అయింది.

Post a Comment