పంచాయతీ కార్యదర్శిపై లంచం డిమాండ్ ఏసీబీ కేసు నమోదు
వివరాల్లోకి వెళితే… బొగ్గు ఉత్పత్తి కోసం అవసరమైన అనుమతులలో భాగంగా అటవీ శాఖ నుండి NOC పొందాల్సి ఉన్న ఒక వ్యక్తికి, ఆ అవసరానికి సంబంధించి గ్రామ పంచాయతీ నుండి అనుమతి (NOC) జారీ చేయడానికి కార్యదర్శి సతీష్ కుమార్ రూ.15,000/- లంచాన్ని డిమాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఫిర్యాదుదారుని అభ్యర్థన మేరకు ఆ మొత్తాన్ని రూ.8,000/- కు తగ్గించినట్లు వెల్లడించారు.
ఈ విషయాన్ని ఫిర్యాదుదారు ACB అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు శుక్రవారం ఈ ఘటనపై సతీష్ కుమార్పై కేసు నమోదు చేశారు. ప్రాధమిక దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలు తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయవచ్చు. అలాగే ఇతర సామాజిక మాధ్యమాలైన:
- వాట్సాప్: 9440446106
- ఫేస్బుక్: Telangana ACB
- ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
- వెబ్సైట్: acb.telangana.gov.in
ద్వారా కూడా సమాచారం అందించవచ్చు.
అంతేగాక, ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరగాలంటూ ACB విజ్ఞప్తి చేసింది.
Post a Comment