-->

పంచాయతీ కార్యదర్శిపై లంచం డిమాండ్ ఏసీబీ కేసు నమోదు

 

పంచాయతీ కార్యదర్శిపై లంచం డిమాండ్ ఏసీబీ కేసు నమోదు

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంతుల సతీష్ కుమార్ పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే… బొగ్గు ఉత్పత్తి కోసం అవసరమైన అనుమతులలో భాగంగా అటవీ శాఖ నుండి NOC పొందాల్సి ఉన్న ఒక వ్యక్తికి, ఆ అవసరానికి సంబంధించి గ్రామ పంచాయతీ నుండి అనుమతి (NOC) జారీ చేయడానికి కార్యదర్శి సతీష్ కుమార్ రూ.15,000/- లంచాన్ని డిమాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఫిర్యాదుదారుని అభ్యర్థన మేరకు ఆ మొత్తాన్ని రూ.8,000/- కు తగ్గించినట్లు వెల్లడించారు.

ఈ విషయాన్ని ఫిర్యాదుదారు ACB అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు శుక్రవారం ఈ ఘటనపై సతీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ప్రాధమిక దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రజలకు హెచ్చరిక & అవగాహన:
తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారిని లంచం అడిగినట్లు ఎవరైనా అనుమానించినా, నిర్ధారించినా వెంటనే స్పందించాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు.

ప్రజలు తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయవచ్చు. అలాగే ఇతర సామాజిక మాధ్యమాలైన:

ద్వారా కూడా సమాచారం అందించవచ్చు.

అంతేగాక, ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరగాలంటూ ACB విజ్ఞప్తి చేసింది.

Blogger ఆధారితం.