హైవేపై రీల్ చేస్తుండగా లారీ ఢీ.. యువకుడు మృతి (వీడియో)
హరియాణాలో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం వీడియో చిత్రీకరిస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం, 12వ తరగతి చదువుతున్న మొయిన్ (19) తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఢిల్లీ–ముంబై హైవేపై బైక్ రైడ్కు వెళ్లాడు. అక్కడే ఇన్స్టాగ్రామ్ రీల్ తీయాలని నిర్ణయించారు.
రీల్ కోసం మొయిన్ తన స్నేహితుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా, మరో స్నేహితుడు మొబైల్ ఫోన్తో వీడియో చిత్రీకరిస్తున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ అదుపు తప్పి వారి వైపు దూసుకొచ్చింది. లారీ నేరుగా మొయిన్ను ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన మొత్తం మొబైల్లో రికార్డ్ కావడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదకర ప్రాంతాల్లో రీల్స్ లేదా వీడియోలు తీయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. 🚨

Post a Comment