-->

కేటీఆర్ క్యాంపు ఆఫీసు దాడిపై తీవ్రంగా ఖండించిన కాపు సీతాలక్ష్మి

కేటీఆర్ క్యాంపు ఆఫీసు దాడిపై తీవ్రంగా ఖండించిన కాపు సీతాలక్ష్మి


సిరిసిల్లలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బీఆర్ఎస్ నేత,  మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ఈ దాడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు, "ఇది ప్రజా సమస్యలను పరిష్కరించలేని పాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చిల్లర రాజకీయల ప్రయోగం" అని విమర్శించారు.

ప్రతిపక్ష పార్టీ నాయకుడి క్యాంపు కార్యాలయంపై అధికారిక పార్టీ కార్యకర్తలు దాడి చేయడం అనేది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజలను నేరుగా ఎదుర్కొని సమస్యల పరిష్కారం చూపాల్సిన స్థాయిలో పాలన జరగకపోవడం వల్లే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

కేటీఆర్ పట్ల ద్వేషాన్ని ప్రదర్శించడమే కాకుండా, దాడులు చేసి తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలంపు అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

అలాగే, అధికారికంగా ఎక్కడైనా కేంద్ర బీజేపీ మంత్రుల ఫోటోలు కాంగ్రెస్ ఎంపీలు తమ కార్యాలయాల్లో పెట్టుకున్నారా? అనే ప్రశ్నను కూడా వారు ఎత్తి చూపారు.

రేవంత్ రెడ్డికి సూచిస్తూ, "మీ ఫోటోలను బలవంతంగా ఎక్కడికైనా పెట్టాలని, మీరు పాలనలో మన్నన పొందినప్పుడు ప్రజలే మీ ఫోటోలను గౌరవంగా పెట్టుకుంటారు. ఆ స్థాయికి మీరు చేరుకోవడానికి ప్రయత్నించండి కానీ ఇప్పుడిలా బలవంతంగా రుద్దితే నిందలే మిగిలతాయి" అని హెచ్చరించారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి బదులుగా ప్రజల సహానుభూతిని పొందాలంటే నిజమైన పాలన సామర్థ్యాన్ని చూపాలని, సమస్యల పరిష్కారాల వైపు దృష్టి పెట్టాలని హితవు పలికారు.

Blogger ఆధారితం.