అదనపు కట్నం వేధింపులో నిందితునికి ఆరు నెలల జైలు శిక్ష
కొత్తగూడెం లీగల్:: అదనపు కట్నం వేధింపు కేసులో నిందితుడు మలోత్ జానకిరామ్కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2,000/- జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. సాయి శ్రీ బుధవారం తీర్పు వెలువరించారు.
మొదట ఒక సంవత్సరం సజావుగా గడిచిన కాపురంలో, తరువాత భర్త జానకిరామ్ మద్యపానం, చేయిచేయి చేసుకోవడం, మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేయడంతోపాటు, ‘తీసుకురాకపోతే మరో పెళ్లి చేసుకుంటా’ అని బెదిరించేవాడని ఫిర్యాదులో తెలిపారు.
ఈ వేధింపులకు మద్దతుగా అతని తల్లి సోనా, ఆడబిడ్డ భూక్యా విజయ, ఆమె కుమారులు మోహన్, యోగేష్లు కూడా ఒత్తిడి చేసేవారని బాధితురాలు ఆరోపించారు. పెద్దమనుషుల మధ్య పంచాయతీలు జరిగినా ఫలితం లేకపోవడంతో, చివరికి బాధితురాలిని ఇంటి నుండి వెళ్లగొట్టారు.
2016 నవంబర్ 26న అప్పటి సబ్ఇన్స్పెక్టర్ ఈ. రాజేష్ వద్ద ఫిర్యాదు నమోదైంది. అనంతరం దర్యాప్తు జరిపి, ఐదుగురిపై చార్జ్షీట్ దాఖలు చేశారు.

Post a Comment