-->

తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ హెచ్చరిక.. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ హెచ్చరిక.. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. అలాగే విద్యుత్‌ స్తంభాలు, నీటి మడుగులు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793