సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు – హైదరాబాద్ పోలీసులు హెచ్చరిక
రేపే హోలీ.. సంబంధం లేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు – హైదరాబాద్ పోలీసులు హెచ్చరిక
హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హోలీ పండుగ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
హోలీ సందర్భంగా అమలు చేసే ఆంక్షలు:
- రేపు (గురువారం) ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
- సంబంధం లేని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లడం పూర్తిగా నిషేధం. ఇది చేస్తే కఠిన చర్యలు తప్పవు.
- రోడ్లపై గుంపులు గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు.
- మద్యం సేవించి రోడ్లపై అల్లర్లు, అసభ్య ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు.
- హోలీ వేడుకల పేరుతో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
హోలీ పండుగను హర్షోల్లాసంగా, శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించకుండా సంయమనంతో జరుపుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Post a Comment