విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద భీమా – దేశ చరిత్రలో మైలురాయి
ఇందిరమ్మ ప్రభుత్వం విద్యుత్ కార్మికుల సంక్షేమానికి ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా, రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఒక్కోరికి రూ.1 కోటి విలువైన ప్రమాద భీమా వర్తించబోతుంది. ఈ పథకాన్ని సీఎం ప్రకటిస్తూ, ప్రజాభవన్లో జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద భీమా చెక్కును అందజేశారు. అలాగే, నరేష్ భార్య శ్రీమతి రమేష్కు విద్యుత్ శాఖలో కారుణ్య నియామకం కూడా ప్రకటించారు.
ఈ పథకం ప్రారంభమై ముందుగా సింగరేణి కార్మికుల కోసం అమలులోకి వచ్చింది. ఇప్పుడు అదే పథకాన్ని విద్యుత్ సంస్థలకూ విస్తరించడం జరిగింది. ఇది కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ మానవీయత, బాధ్యతాయుతమైన విధానానికి ప్రతిరూపంగా నిలుస్తోంది.
ప్రమాద భీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన NPDCL CMD వరుణ్ రెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ కార్మికుడు భరోసాతో, భయభ్రాంతుల లేకుండా పని చేయగలగాలి. అదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం,” అని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం కార్మికుల జీవిత భద్రతను మెరుగుపరచడంలో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Post a Comment