-->

గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు మంజూరు – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ


హైదరాబాద్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రముఖ ప్రజాగాయకుడు, విప్లవ కవి గద్దర్ ఆశయాలను సజీవంగా నిలిపేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్ల నిధులను మంజూరు చేస్తూ భాషా మరియు సాంస్కృతిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన హామీ మేరకు ఈ నిధులు విడుదలయ్యాయి. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ చేసిన సేవలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన కీలక భూమికను గుర్తించిన ప్రభుత్వం ఆయన జయంతిని ప్రతివ సంవత్సరం అధికారికంగా జరుపుతుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నిధులు ఫౌండేషన్ అభివృద్ధికి, కార్యకలాపాల నిర్వహణకు వినియోగించుకునేలా నిర్ణయించబడింది. అలాగే ఇకపై గద్దర్ జయంతి కార్యక్రమాల నిర్వహణలో ఫౌండేషన్‌కు భాగస్వామ్యం కల్పించేందుకు మరో ఉత్తర్వును ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ చర్యలతో గద్దర్ ఆశయాల వ్యాప్తికి, ఆయన వహించిన ప్రజా భావోద్వేగాలను ప్రాతినిధ్యం వహించే కార్యక్రమాల ప్రోత్సాహానికి ఇది దోహదపడనుందని భావిస్తున్నారు. విప్లవ గాయకుడిగా గద్దర్ కేవలం కళాకారుడిగా కాకుండా, ప్రజల హక్కుల కోసం పోరాడిన యోధుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఆశయాల స్ఫూర్తిని కొత్త తరం వరకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం ప్రశంసనీయమని పలువురు సాంస్కృతికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా, గద్దర్ సేవల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిన ఈ గౌరవం, ఆయన ఆశయాల సాధనకు భవిష్యత్తులో మరింత బలాన్నిచ్చే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.