సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకు రంగం సిద్ధం!
హైదరాబాద్, తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ, మంచి వార్త. మే 22 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను జూన్ 16న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
ఈసారి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల కోసం 892 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలకు ఒకవైపు ముందు ఫెయిలైన విద్యార్థులు హాజరవుతే, మరోవైపు మార్కుల్ని మెరుగుపర్చుకునేందుకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య కూడా అధికంగా ఉంది. దీనితో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య ఈసారి గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.
పరీక్షల ముగిసిన వెంటనే రెండు విడతలుగా మూల్యాంకన ప్రక్రియ నిర్వహించారు. మే 29న మొదటి విడత ప్రారంభమై, మే 31న రెండో విడత ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయ్యే దశలో ఉండటంతో, ఫలితాల విడుదలకు సన్నాహాలు పూర్తి చేశారు.
ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రకటన ప్రకారం, సోమవారం జూన్ 16న మధ్యాహ్నం ఫలితాలు అధికారికంగా విడుదల కానున్నాయి. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ (tsbie.cgg.gov.in)తో పాటు టీవీ9 తెలుగు వెబ్సైట్ (tv9telugu.com)లో కూడా చూసుకోవచ్చని తెలిపారు.
ఈఏపీసెట్, నీట్, జోసా కౌన్సెలింగ్లలో ఇంటర్ మార్కుల ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో, విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు ఇది కీలకంగా మారింది.
విద్యార్థులు తమ హాల్టికెట్ నంబర్తో ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాల వెల్లడికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠతో వేచిచూస్తున్నారు.
Post a Comment