15 వేలు లంచం తీసుకుంటూఏసిబికి చిక్కున విద్యుత్ శాఖ ఉప ఇంజనీరు
కల్వకుర్తి : నగర్కర్నూల్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉచ్చు వేసి నిర్వహించిన దాడిలో విద్యుత్ శాఖకు చెందిన ఉప ఇంజనీరు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
TGSPDCL నాగర్కర్నూల్ డివిజన్ & సర్కిల్ పరిధిలోని కల్వకుర్తి సబ్డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉప ఇంజనీరు (ఆపరేషన్స్) & వెల్దండ సెక్షన్ ఇన్చార్జ్ అసిస్టెంట్ ఇంజనీరు యెద్దుల వెంకటేశ్వర్లు ఫిర్యాదుదారుని నుండి లంచం స్వీకరిస్తూ ఏసీబీ బృందానికి చిక్కాడు.
₹20,000 డిమాండ్… ₹15,000 స్వీకరణ సమయంలో పట్టుబడి
ఫిర్యాదుదారుని ఇంటి సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం మరియు అతని పేరుపై మీటర్ మంజూరు ప్రక్రియను పూర్తి చేయడానికి నిందిత అధికారి ₹20,000 లంచం డిమాండ్ చేసినట్లు ACB తెలిపింది.
ఈ నేపథ్యంలో, ఫిర్యాదుదారు సాక్ష్యాలతో కలిసి ఏసీబీని సంప్రదించగా, అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్లో ₹15,000 స్వీకరిస్తూన్న సమయం లోనే అతడిని అరెస్ట్ చేశారు.
ట్రాప్ మనీని ACB స్వాధీనం చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
ప్రజలకు ACB విజ్ఞప్తి – లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి
ఏ ప్రభుత్వ శాఖలోనైనా అవినీతి ఎదురైనప్పుడు ప్రజలు సంకోచం లేకుండా ACBని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
సంప్రదించడానికి:
- టోల్ ఫ్రీ నెంబర్: 1064
- WhatsApp: 9440446106
- Facebook: Telangana ACB
- X (Twitter): @TelanganaACB
- అధికారిక వెబ్సైట్: acb.telangana.gov.in

Post a Comment