బ్రిడ్జి కూలి విషాదం: మహారాష్ట్రలో ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంఘటన చోటుచేసుకుంది. పుణె సమీపంలోని ఇంద్రయాణి నదిపై నిర్మించబడిన వంతెన అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందగా, మరో 25 మంది గల్లంతైనట్లు సమాచారం.
శనివారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగింది. పలువురు పర్యాటకులు వంతెనపై నడుస్తుండగా ఒక్కసారిగా వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెన కిందుగా ప్రవహిస్తున్న ఇంద్రయాణి నదిలో సుమారు 15 మంది పర్యాటకులు పడిపోయారు. మిగిలిన వారు నదిలోకి కొట్టుకుపోయిన అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రయాణికుల అరుపులతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. స్థానికులు, పోలీసు సిబ్బంది, మరియు NDRF బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి. ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఇటువంటి విషాదకర ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పురాతన వంతెనలన్నింటిపై సమీక్ష జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
Post a Comment