బక్రీద్ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపు
జగిత్యాల: బక్రీద్ పర్వదినాన్ని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జగిత్యాల జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) అశోక్ కుమార్ ప్రజలను కోరారు. శుక్రవారం రోజున ఆయన జిల్లా కేంద్రంలోని ముఖ్య ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు.
బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని ముఖ్య కూడళ్లలో, మసీదుల వద్ద, టవర్ సర్కిల్ వంటి జనసాంద్రత ప్రాంతాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
ఈ తనిఖీల సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్తో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఎస్ఐ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రజలు పరస్పర గౌరవంతో, సహనంతో పండుగను జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలపై గమనించగలిగినట్లయితే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
జిల్లాలో శాంతి, భద్రతకు భంగం కలగకుండా పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తారని, అన్ని ప్రాంతాల్లో గశన పెట్రోలింగ్ బలగాలను మోహరించామని ఎస్పీ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.
Post a Comment