-->

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడి

 

సీపీఐ – కాంగ్రెస్ సమాన ఆధిక్యం.. ఉత్కంఠభరితంగా ముగిసిన కౌంటింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో ముగిసింది. కౌంటింగ్ హాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో బ్యాలెట్ బాక్సుల సీల్స్‌ను ఓపెన్ చేశారు.

ప్రతి దశలోనూ పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భద్రతను పటిష్టం చేశారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు నిర్వహించబడింది.

పార్టీల వారీగా గెలిచిన డివిజన్లు:

  • సీపీఐ – 22 డివిజన్లు
  • కాంగ్రెస్ – 22 డివిజన్లు
  • టీఆర్ఎస్ – 8 డివిజన్లు
  • ఇండిపెండెంట్లు – 6 డివిజన్లు
  • సీపీఎం – 1 డివిజన్
  • బీజేపీ – 1 డివిజన్

ఈ ఫలితాలతో సీపీఐ మరియు కాంగ్రెస్ పార్టీలు సమానంగా 22 డివిజన్లు గెలుచుకుని ప్రధాన పోటీలో నిలిచాయి. ఇక టీఆర్ఎస్ 8 స్థానాలతో మూడో స్థానంలో నిలవగా, స్వతంత్ర అభ్యర్థులు కూడా 6 డివిజన్లు సాధించి తమ ప్రభావాన్ని చాటుకున్నారు.

మొత్తం ఫలితాలు జిల్లాలో రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చాయి. కార్పొరేషన్ పీఠంపై ఎవరు అధిష్టానం చేపడతారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మద్దతుల రాజకీయాలు వేడెక్కే అవకాశముంది.

జిల్లా ప్రజలు కొత్త పాలనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి స్థాయి అధికారిక ప్రకటనల అనంతరం మేయర్ ఎన్నికపై స్పష్టత రానుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793