13వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన OU జూనియర్ అసిస్టెంట్ ఇంకో అధికారి అరెస్ట్
అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోని పే-బిల్ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె. రమేష్ (48), ఫిర్యాదుదారుడి నుంచి రూ. 13,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా Telangana Anti Corruption Bureau (ACB) అధికారులు అతడిని పట్టుకున్నారు.
రమేష్ తనతో పాటు అదే విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అరవింద్ తరపున కూడా ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి తల్లికి సంబంధించిన పెన్షన్ బెనిఫిట్ ఫైల్ను ఇప్పటికే ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపినందుకు ప్రతిఫలంగా, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ను తదుపరి చర్యల కోసం ముందుకు పంపేందుకు ఈ లంచాన్ని అక్రమంగా స్వీకరించినట్లు తెలిసింది.
అవినీతి నిరోధక శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది — ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించింది. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment