మల్కాజిగిరి కమిషనరేట్లో ఏఎస్ఐ లంచం కేసు… రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ
హైదరాబాద్, ఏప్రిల్ 1: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) పూసాల బాలయ్య లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడిపై నమోదైన క్రిమినల్ కేసులో సెక్షన్ మార్పు చేయడం, అలాగే ఆ కేసును లోక్ అదాలత్లో రాజీ చేయించేందుకు రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ACB అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థలో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- 📞 టోల్ ఫ్రీ నెంబర్: 1064
- 📱 వాట్సాప్: 9440446106
- 🌐 వెబ్సైట్: acb.telangana.gov.in
- ఫేస్బుక్: Telangana ACB
- ఎక్స్ (Twitter): @TelanganaACB
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ACB అధికారులు తెలిపారు.

Post a Comment