ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. హైదరాబాద్లో విషాదం
ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. హైదరాబాద్లో విషాదం
హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్గా గుర్తించారు. శనివారం ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అభిరూప్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత సమస్యలా, చదువుకు సంబంధించిన ఒత్తిడా లేదా మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Post a Comment