-->

వాంకిడి మండలంలో ఉద్రిక్తత

 

వాంకిడి మండలంలో ఉద్రిక్తత

 ఆసిఫాబాద్ జిల్లా: వాంకిడి ఆశ్రమ పాఠశాల 9వ తరగతి,విద్యార్ధిని శైలజ ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందగా.. 

దీంతో శైలజ మృతదేహాన్ని ఈరోజు వాంకిడి మండలం దాబా గ్రామంలోని ఇంటికి తీసుకొని రాగా అంబులెన్స్‌ నుంచి భౌతికకాయాన్ని దించనివ్వకుండా బంధువులు అడ్డుకొని నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్‌ వచ్చి మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. 

కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో బాలిక పార్థివ దేహాన్ని ఇంట్లో సందర్శన కోసం ఉంచారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. 

వాంకిడి వైపు వెళ్ళే వారిని తనిఖీలు చేసి పంపిస్తు న్నారు. ఇక, కొమురం భీం జిల్లా పోలీసులతో పాటు ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లా పోలీసులను కూడా ఉన్నతాధికారులు రప్పించారు. 

విద్యార్ధిని ఇంటికి వెళ్లడానికి జిల్లాలో మీడియాపై సైతం పోలీసుల ఆంక్షలు విధించారు. విద్యార్ధిని శైలజ స్వగ్రామానికి వెళ్లకుండా 10 కిలో మీటర్ల దూరంలో మీడియాను ఆపేశారు. 

చర్చలు జరుగుతున్నా యి .. మీడియాకు అను  మతి లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై జర్నలిస్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. దీంతో వాంకిడి మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793