భారతదేశంపై దాడి చేస్తే ఊరుకోము: పాక్కు JNTUH విద్యార్థి నేత ఎరవెల్లి జగన్ తీవ్ర హెచ్చరిక
కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో JNTUH (జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్) విద్యార్థి నేత ఎరవెల్లి జగన్తో పాటు విశ్వవిద్యాలయానికి చెందిన అనేక మంది విద్యార్థులు, స్థానిక క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇక పహాల్గామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తూ, వారిని "అమరవీరులు" గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రవీణ్ పగడాల గారి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని వారు కోరారు.
ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్థులు మరియు సంఘ సభ్యులు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. "ఉగ్రవాదానికి బ్రేక్ వేయాలి", "భారత దేశ భద్రతకు మద్దతు ఇవ్వండి" వంటి నినాదాలు మోగించారు. భారీ సంఖ్యలో చర్చ్ యువత, సంఘ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ర్యాలీ మార్గం: శాంతి ర్యాలీ శేరిలింగంపల్లి నుండి మియాపూర్ మీదుగా కూకట్పల్లి మెట్రో గ్రౌండ్ వరకు సాగి, అక్కడ ముగింపు సభ నిర్వహించబడింది. ముగింపు సభలో ప్రత్యేక ప్రార్థనలు: అనంతరం భారతదేశం, తెలంగాణ రాష్ట్ర భద్రత, శాంతి, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు, అధికారులు సురక్షితంగా ఉండాలని భగవంతుని వేడుకున్నారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల నుండి: ప్రవీణ్, హనోక్, ప్రిన్స్, ప్రభు కుమార్, ఎస్తేర్, అశ్విని, మేరీ, ఆనంద్, బ్యూలా తదితర విద్యార్థులు చురుకైన పాత్ర పోషించారు.
Post a Comment