-->

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్‌ బాలల రక్ష భవన్‌ను ఆకస్మిక తనిఖీ

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్‌ బాలల రక్ష భవన్‌ను ఆకస్మిక తనిఖీ

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్‌ బాలల రక్ష భవన్‌ను సందర్శించారు

కొత్తగూడెం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ శుక్రవారం కొత్తగూడెంలో ఉన్న బాలల రక్ష భవన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. తన పర్యటనలో భవన్‌లోని సదుపాయాలు, నిర్వహణ, పిల్లల సంక్షేమం పట్ల తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీశారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి నిర్వహకులను పలుకరించి, పిల్లల రక్షణకు సంబంధించి తీసుకుంటున్న చర్యల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు. ఎం. రాజేందర్‌ పర్యటన పట్ల సిబ్బంది సహకరించగా, ఈ తనిఖీ బాలల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను ప్రతిబింబించిందని పలువురు అభిప్రాయపడ్డారు.


Blogger ఆధారితం.