కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడిని బీఆర్ఎస్ ఖండన బానోత్ పుష్పలత
మణుగూరు పట్టణ బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షురాలు బానోత్ పుష్పలత తీవ్రంగా స్పందించారు.
సిరిసిల్లలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నేత బానోత్ పుష్పలత తెలిపారు. ఈ దాడి పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విరుద్ధంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడాన్ని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగడం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు. ఈ దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతల ప్రవర్తనను ఆమె “డైవర్షన్ పాలిటిక్స్” అని అభివర్ణించారు. ‘‘రాహుల్ గాంధీ కార్యాలయంలో మోదీ ఫోటో ఉంటుందా?’’ అంటూ బానోత్ పుష్పలత కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టే ఈ చర్యలను వెంటనే ఆపాలని హెచ్చరించారు.
పోలీసుల లాఠీచార్జ్ను కూడా ఆమె ఖండించారు. ‘‘పోలీస్ వ్యవస్థ ఒకపక్షంగా కాకుండా న్యాయంగా వ్యవహరించాలి. బాధితులకు న్యాయం జరగాలి. కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి,’’ అని ఆమె స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కించపరిచే, ప్రత్యర్థులను భయపెట్టే ప్రయత్నాలు తగవని, బీఆర్ఎస్ పార్టీ శాంతికి, ప్రజాస్వామ్యానికి నిబంధితంగా ఉండి వ్యవహరిస్తుందని పుష్పలత హితవు పలికారు.
"ప్రజలు ఈ కుట్ర రాజకీయాలను గుర్తించి ఖండించాలి" అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Post a Comment