-->

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కీ గాయాలు?

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కీ గాయాలు?


హైదరాబాద్, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర గాయాలకు గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నివాసమైన ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద బాత్రూంలో కాలు జారిపడి కింద పడిన ఆయనకు కాలు విరిగినట్టు సమాచారం. దీంతో ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళితే, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిస్తున్న కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం రాత్రి నుంచే ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం బాత్రూంలోకి వెళ్లిన ఆయన అప్రమత్తంగా ఉండకపోవడంతో కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను అంబులెన్స్‌లో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించగా, ప్రస్తుతం యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు మొదటికృషిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కావాల్సి ఉంది.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ నాయకులు, శ్రేణులు ఎమ్మెల్యే పల్లా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Blogger ఆధారితం.