భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడగొండ గ్రామంలో భార్య చెప్పిన పదులు భర్తను గుండెను పిండేసినట్టు చేశాయి. అవమానాన్ని తట్టుకోలేని భర్త తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన చోటుచేసుకుంది.
తడగొండ గ్రామానికి చెందిన హరీశ్ (36) కు కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరితో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడేందుకు హరీశ్ దుబాయికి వెళ్లి పనిచేస్తుండగా, భార్య కావేరి ఇంట్లోనే వివాహేతర సంబంధం పెంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం హరీష్కు తెలిసిన తర్వాత ఫోన్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో జూన్ 8న హరీశ్ స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత భార్య కావేరి అతనితో తీవ్రంగా తగువుగా మాట్లాడుతూ – "నువ్వు నాకు వద్దు, చచ్చిపో.. నేను రక్షణ్తోనే ఉంటా" అంటూ తేల్చి చెప్పిందని సమాచారం.
ఇలా భార్య చెప్పిన మాటలతో తీవ్ర మనోవేదనకు లోనైన హరీశ్ "బయటకు వెళ్లి వస్తా" అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తరువాత స్థానిక వ్యవసాయ బావిలో మృతదేహంగా కనిపించాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
హరీశ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కావేరి మరియు ఆమె ప్రియుడు రక్షణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన తడగొండ గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఒక నిరీహ భర్త జీవితాన్ని పొట్టనపెట్టుకున్న సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment