ఏఎల్పీలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటు చేసిన రియాజ్ అహ్మద్
కార్మిక హితం కోసమే మా ప్రయత్నం: హెచ్ఎంఎస్ రియాజ్
అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ALP) పరిధిలో హెచ్ఎంఎస్ (HMS) యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ పాల్గొని కార్మికుల సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. సంస్థ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించిన ఆయన, వాటి పరిష్కారానికి సంఘటిత పోరాటం అవసరమని చెప్పారు.
ఈ సందర్బంగా ALP శాఖ కొత్త కమిటీని ఆయన ప్రకటించారు. కార్మికుల హక్కులను కాపాడటం, వారి సంక్షేమం కోసం పనిచేయడమే కొత్త కమిటీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కొత్త కమిటీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
కొత్తగా ఎన్నుకున్న ALP శాఖ కమిటీ సభ్యులు:
- బ్రాంచ్ సెక్రటరీ: మహేష్
- పిట్ సెక్రటరీ: రాజశేఖర్
- జాయింట్ సెక్రటరీ: ముత్యం పవన్
- చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ: రంగు అంజి
- అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు:
- గోశిక శ్రీకాంత్
- నవీన్ కుమార్
- అజయ్ హుస్సేన్
- సోషల్ మీడియా ఇన్చార్జ్: రవికుమార్
- ఖజానాదారు (ట్రెజరర్): దస్తగిరి
- సెంట్రల్ కమిటీ సభ్యులు:
- గౌసిక అశోక్
- ఇస్మాయిల్
- RG-3 బ్రాంచ్ సెక్రటరీ: గుత్తి శాంతి స్వరూప్
- ఇతర కమిటీ సభ్యులు:
- ఉప్పు రమేష్
ఈ గేట్ మీటింగ్లో కార్మికుల సహకారం అత్యంత ముఖ్యమని, తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, వారికి సంఘం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హెచ్ఎంఎస్ నాయకులు పేర్కొన్నారు.
Post a Comment