-->

తెలంగాణలో 26 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. వరంగల్ సీపీగా శ్వేత

 

తెలంగాణలో 26 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. వరంగల్ సీపీగా శ్వేత

తెలంగాణలో 26 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. వరంగల్ సీపీగా శ్వేత

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. మొత్తం 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించగా, కీలక విభాగాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.

ప్రధాన నియామకాలు ఇవీ..

  • వరంగల్ పోలీస్ కమిషనర్‌గా శ్వేత నియామకం.
  • కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా సింధుశర్మ.
  • సీఐడీ ఎస్పీగా చెన్నూరి రూపేష్.
  • వికారాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్పీగా రాజేష్ మీరా.
  • సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్.
  • సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వై. సాయిశేఖర్.
  • సీఐడీలో ఎస్పీలుగా చెన్నూరి రూపేష్, ప్రవీణ్ కుమార్.
  • గోల్కొండ జోన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి.
  • ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా చంద్రమోహన్.
  • ఇంటెలిజెన్స్ ఎస్పీగా రామ్ రెడ్డి.
  • హైడ్రా అదనపు కమిషనర్‌గా ఆనంద్ కుమార్.
  • ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఇక్బాల్ సిద్దిఖీ.

ఈ బదిలీలతో రాష్ట్ర పోలీసు శాఖలో కీలక పోస్టుల్లో కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793