భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం.. అర్ధరాత్రి ఉలిక్కిపడ్డ ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం.. అర్ధరాత్రి ఉలిక్కిపడ్డ ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అధికారుల వివరాల ప్రకారం, తెల్లవారుజామున 2:26 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. భూకంప ప్రకంపనలు కొన్ని సెకన్లపాటు మాత్రమే కొనసాగినప్పటికీ, ప్రజల్లో ఆందోళన నెలకొంది.
జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) తెలిపిన వివరాల ప్రకారం, భూకంప కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని Rajahmundry నగరానికి వాయువ్య దిశగా సుమారు 111 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది.
ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. అయితే ప్రకంపనలను స్పష్టంగా అనుభవించిన ప్రజలు భయాందోళనలకు గురై కొంతసేపు ఇళ్ల బయటే గడిపారు.
అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Post a Comment