నేటి నుండి మన నీడ మనకు కనిపించదా?
జీరో షాడో ఫినామెనాన్ పై శాస్త్రీయ విశ్లేషణ
భూమి మీద ఓ అరుదైన ఖగోళ ఘటన నేడు ప్రారంభం కానుంది. ఖగోళ శాస్త్రజ్ఞుల ప్రకారం, మే 6 నుంచి మే 14 వరకూ మధ్యాహ్నం సమయంలో రెండు నిమిషాల పాటు మన శరీరానికి నీడ కనిపించదు. దీనికి ‘జీరో షాడో డే’ అనే పేరు ఉంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేకా సుసత్య రేఖ వెల్లడించారు.
నీడ ఎలా కనిపించదే?
ప్రతి ఏడాది రెండు సార్లు, మకర రేఖ (Capricorn) మరియు కర్కాటక రేఖ (Cancer) మధ్య ఉన్న ప్రాంతాల్లో సూర్యుడు నేరుగా తలపైకి వస్తాడు. భూమి 23.5 డిగ్రీల వంగిన ధురంలో తిరుగుతుంది కాబట్టి, కొన్ని రోజుల్లో సూర్య కిరణాలు నేలపై నిలువుగా పడతాయి.
ఈ సమయంలో నిలువుగా ఉన్న వస్తువులకు నీడ కనిపించదు. ఇది ఖచ్చితంగా మధ్యాహ్న సమయంలో, 2 నిమిషాల పాటు మాత్రమే జరుగుతుంది.
'జీరో షాడో డే' గురించి తెలియాల్సిన అంశాలు:
- ఇది ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుగుతుంది
- మధ్యాహ్న సమయంలో మాత్రమే కనిపిస్తుంది
- భూమి తిప్పే ధోరణి కారణంగా ఏర్పడే ఖగోళ సంఘటన
- దీనికి శాస్త్రీయంగా ఆధారాలు ఉన్నాయి
నెపోలియన్ సినిమా గుర్తొస్తుంది
ఈ విస్మయకరమైన సైన్స్ ఫినామెనాన్ ఆధారంగా 2017లో ‘నెపోలియన్’ అనే తెలుగు చిత్రం రూపొందింది. అయితే, సినిమాలో ఇది ఊహాపూరితంగా చూపబడినప్పటికీ, వాస్తవ జీవితంలో ఇది ఖచ్చితమైన ఖగోళ సంఘటన. ఇప్పుడు మళ్లీ అదే సినిమా చర్చలోకి వచ్చింది.
Post a Comment