అతిగా మద్యం త్రాగి వాహనాలు నడిపిన కేసులలో 98 మందికి కోర్టు జరిమానా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోర్టులో 98 మందికి అతిగా మద్యం త్రాగి వాహనాలు నడిపిన కేసులలో జరిమానాలు విధించారు. ఈ తీర్పును స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు మంగళవారం ప్రకటించారు.
కొత్తగూడెం వన్ టౌన్ ఎస్.ఐ తుంగ రాకేష్ మరియు జి. విజయ ల కథనాల ప్రకారం, వాహనాలు నడిపిస్తున్న రెండు వ్యక్తులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా వారు మద్యం తాగినట్లు రుజువయ్యింది. కోర్టులో వారు నేరం ఒప్పుకొని, మెజిస్ట్రేట్ జారీచేసిన జరిమానా చెల్లించారు.
అలాగే, కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్.ఐ కె. నరేష్ పర్యవేక్షణలో జరిగిన వాహన తనిఖీలలో 10 మంది వ్యక్తులు మద్యం త్రాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం త్రాగినట్లు నిర్ధారించబడ్డారు. కోర్టులో వారు నేరం ఒప్పుకుని జరిమానా చెల్లించారు.
టూ టౌన్ ఎస్.హెచ్.ఓ ప్రతాప్ ఆధ్వర్యంలో 5 మందిని ఆపి పరీక్షించగా వారు కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు రుజువయ్యారు. వారూ కోర్టులో నేరం ఒప్పుకొని జరిమానా చెల్లించారు.
ఇతర ప్రాంతాల్లో కూడా, 15 మందిని, 12 మందిని, 14 మందిని, 20 మందిని తదితర వాహనదారులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్లు కనుగొనబడింది. వారూ కోర్టులో నేరం ఒప్పుకొని జరిమానా చెల్లించారు.
ఈ కేసుల ద్వారా, మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమై, ప్రజలలో మరింత అవగాహన రావాలని అధికారులు తెలిపారు.
Post a Comment