-->

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసినప్పుడే ముదిరాజ్ సంఘానికి నిష్పక్షపాత అభివృద్ధి

 

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసినప్పుడే ముదిరాజ్ సంఘానికి నిష్పక్షపాత అభివృద్ధి

వ్యాఖ్యాత్మక వ్యూహంతో ప్రభుత్వం పై ఒత్తిడి : హామీల అమలుతోనే ముదిరాజుల అభివృద్ధి సాధ్యం – డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్

కామారెడ్డి : ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసినప్పుడే ముదిరాజ్ సంఘానికి నిష్పక్షపాత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ (TMMS) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అలుపెరుగని ఉద్యమ స్ఫూర్తితో ముదిరాజ్ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. “పెద్దమ్మ తల్లి పూజలు, పండగలు ముదిరాజ్ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని” వ్యాఖ్యానించిన విఠల్ ముదిరాజ్, ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండాలు ఆవిష్కరణతో చైతన్యం పెరిగిందని చెప్పారు.

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటుకు గల విశేష ప్రయాణం ప్రస్తుతం ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. “పెద్దమ్మ తల్లి ఆలయాల నిర్మాణం ఉమ్మడి జిల్లాలలో (కామారెడ్డి-నిజామాబాద్) వేగంగా సాగుతోంది” అని తెలిపారు.

రాజ్యాంగం స్పూర్తితో ధర్మయుద్ధం:

"మేమెంతో - మాకంత" అనే నినాదంతో ముదిరాజ్ జాతి రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధిలో వాటా కోసం నిరంతరం పోరాడుతోందని వివరించారు. ఈ పోరాటం న్యాయస్థానాల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలుగా మారిందని తెలిపారు. BC "A" కింద ముదిరాజ్ సామాజిక స్థితిని గుర్తించి, విద్యా, ఉద్యోగాల్లో న్యాయమైన వాటా కల్పించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.

కార్యాచరణలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ కీలకం:

మత్స్య శాఖలో సభ్యత్వాల సాధన కోసం ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడిని కొనసాగిస్తున్నామని చెప్పారు. "నా పంతం – ప్రభుత్వం పై ఒత్తిడే" అనే విధానంతో ఉద్యమం కొనసాగిస్తున్నట్టు డాక్టర్ విఠల్ ముదిరాజ్ స్పష్టం చేశారు.

స్ఫూర్తిదాయక నాయకత్వం:

డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ జాతి కోసం అలుపెరగని ఉద్యమ బావుటా ఎగురవేస్తున్నారని ఆయన అభిమానులు ప్రశంసించారు. "కాలుకు గజ్జ కట్టుకుని జాతి కోసం తిరుగుతున్న విజేత విట్టలన్న" అని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ బెస్త కొనియాడారు.

ఈ కార్యక్రమంలో లింగంపేట మండల అధ్యక్షుడు సాయికుమార్ ముదిరాజ్, సంద బాలయ్య ముదిరాజ్, కిషన్ ముదిరాజ్, రవి ముదిరాజ్, గంగయ్య ముదిరాజ్, కరుణాకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.