TEE1104 యూనియన్ ప్రతినిధుల బృందం CGM (HR) తో కీలక అంశాలపై చర్చ
CGM (HR) అజయ్ ని మర్యాదపూర్వకంగా TEE1104 యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాయిబాబా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీర్, జెన్కో అధ్యక్షులు కేశ బోయిన కోటేశ్వరరావు, జెన్కో అడిషనల్ సెక్రటరీ కుశలవ్ రెడ్డి, పోచంపాడు రీజినల్ అధ్యక్షుడు చంద్రయ్య, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, అభివృద్ధి సంబంధిత పలు కీలక అంశాలపై చర్చించబడింది.
సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలు:
-
డిపెండెంట్ ఉద్యోగాల నియామకం:మొత్తం 121 మంది డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఫైళ్ళను సీఎండి సంతకం చేసినట్లు తెలిపి, వీటి నియామక ఉత్తర్వులను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందిస్తామని హామీ ఇచ్చారు.
-
మెడికల్ కాంపొజిషన్ (గ్రౌండ్ కేసులు):మెడికల్ కాంపొజిషన్ కింద 16 మందికి త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులకు ప్రాధాన్యతనిస్తూ, వారి ఫైళ్ళను వేగంగా సర్కులేట్ చేసి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
-
ఎల్డిసి కన్వర్షన్:డిగ్రీ అర్హత కలిగిన కార్మికులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, అర్హత సాధించినవారికి LDC (లోవర్ డివిజన్ క్లర్క్) పోస్టులకు కన్వర్షన్ చేసే ప్రక్రియ చేపడతామని వెల్లడించారు.
-
OS నుంచి JPAకి కన్వర్షన్:ఆఫీస్ సబార్డినేట్ (OS) ఉద్యోగులను జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (JPA)గా మార్చే ప్రక్రియకు సంబంధించిన ఫైల్ను త్వరలోనే ఆమోదించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
-
YTPS కార్మికుల షిఫ్ట్ అలవెన్స్:వై టి పి ఎస్ లో పనిచేస్తున్న కార్మికులకు రావలసిన షిఫ్ట్ అలవెన్స్ మంజూరు చేయాలని యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
-
ఆర్టిజన్ కార్మికులకు ప్రమోషన్:ఆర్టిజన్ గ్రేడ్లో పనిచేస్తున్న కార్మిక సోదరులకు ప్రమోషన్ కల్పించాలని అధికారులను కోరినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో అన్ని అంశాలపై రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాయిబాబా సమగ్రంగా చర్చించడమే కాకుండా, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై అధికారుల దృష్టిని సారించారని సమాచారం.
Post a Comment