-->

తెలంగాణలో 13 రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..!!

 

తెలంగాణలో 13 రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..!!

📍 హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలకంగా స్పందించింది. గత ఆరు సంవత్సరాలుగా ఏ ఎన్నికల్లోనూ పాల్గొనని 13 రాజకీయ పార్టీలను అధికారికంగా తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో “ఎందుకు మీ పార్టీని రిజిస్టర్ చేసిన రాజకీయ పార్టీ జాబితా నుంచి తొలగించకూడదో” వివరంగా తెలియజేయాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులను శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని, సంబంధిత పార్టీలు ఎంతకాలంగా ఎన్నికల్లో పోటీ చేయలేదో, ప్రజా కార్యకలాపాలేమైనా నిర్వహిస్తున్నాయా అనే వివరాలతో కూడిన నివేదికలు జూలై 10 లోపు సమర్పించాలని ఆదేశించారు. ఈ నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పార్టీలపై ఆరోపణలు ఇలా ఉన్నాయి:

  • ప్రజల్లో దృష్టి ఆకర్షించేందుకు పార్టీ పేరును ఉపయోగిస్తూ పత్రికల్లో ప్రకటనలు
  • సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం
  • కానీ, ఎన్నికల పోటీ లేకపోవడం

❗నోటీసులు అందుకున్న 13 రాజకీయ పార్టీలు:

  1. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ – హైదరాబాద్
  2. తెలంగాణ లోక్ సత్తా పార్టీ – హైదరాబాద్
  3. తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం – హైదరాబాద్
  4. యువ పార్టీ – హైదరాబాద్
  5. బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే) – మేడ్చల్ మల్కాజిగిరి
  6. తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ – మేడ్చల్ మల్కాజిగిరి
  7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ – రంగారెడ్డి
  8. జాతీయ మహిళా పార్టీ – రంగారెడ్డి
  9. యువ తెలంగాణ పార్టీ – రంగారెడ్డి
  10. తెలంగాణ ప్రజా సమితి (కిషోర్, రావు, కిషన్) – వరంగల్
  11. తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ – హన్మకొండ
  12. ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ – హైదరాబాద్
  13. జాగో పార్టీ – హైదరాబాద్

📌ఈ చర్యలతో రాష్ట్రంలోని రాజకీయ వాతావరణంపై మరింత స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. పార్టీగా గుర్తింపు ఉండాలంటే క్రమం తప్పకుండా ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని ఈసీ స్పష్టం చేస్తోంది..

Blogger ఆధారితం.