ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్లను నియమించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంచడం, నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యల భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల వారీగా నూతన ఇంఛార్జ్లను నియమించారు. జిల్లాల వారీగా సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పార్టీలో అనుభవం, నాయకత్వ గుణాలను పరిగణలోకి తీసుకొని ఈ నియామకాలు చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీ నిర్వహణను మరింత గట్టిగా పట్టే ఉద్దేశంతో ఈ కొత్త బాధ్యతల కేటాయింపు జరిగింది. ఇంఛార్జ్ల నియామకంతో జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగేందుకు అవకాశముందని భావిస్తున్నారు.
నియమితులైన ఇంఛార్జ్లు ఇలా:
- ఖమ్మం జిల్లా – వంశీచంద్రెడ్డి
- నల్గొండ జిల్లా – సంపత్ కుమార్
- మెదక్ జిల్లా – పొన్నం ప్రభాకర్
- వరంగల్ జిల్లా – అడ్లూరి లక్ష్మణ్
- హైదరాబాద్ – జగ్గారెడ్డి
- రంగారెడ్డి జిల్లా – శివసేనారెడ్డి
- ఆదిలాబాద్ జిల్లా – అనిల్ కుమార్ యాదవ్
- కరీంనగర్ జిల్లా – అద్దంకి దయాకర్
- మహబూబ్నగర్ జిల్లా – కుసుమ కుమార్
- నిజామాబాద్ జిల్లా – అజ్మత్ హుస్సేన్
ఈ నియామకాలు పార్టీ అంతర్గత వ్యవస్థను శక్తివంతం చేయడంలో, వచ్చే స్థానిక ఎన్నికలు మరియు ఎంపీ ఎన్నికల దృష్ట్యా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నియమితులైన ఇంఛార్జ్లు తక్షణమే బాధ్యతలు స్వీకరించి, జిల్లాలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయాలని టీపీసీసీ సూచించింది.
Post a Comment