-->

💥కరీంనగర్‌లో పుస్తెలతాడు దొంగతనంతో కలకలం

💥కరీంనగర్‌లో పుస్తెలతాడు దొంగతనంతో కలకలం


కరీంనగర్ పట్టణంలోని మారుతినగర్‌లో బుధవారం ఉదయం జరిగిన దొంగతనంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుర్తుతెలియని దుండగుడు ఓ మహిళపై దాడి చేసి మెడలో ఉన్న పుస్తెలతాడును అపహరించిన ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలు స్వరూప తెలిపిన వివరాల ప్రకారం – ఆమె ఉదయం తన నివాసానికి సమీపంలోని రోడ్డుపై నడుస్తుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి దగ్గరకు వచ్చి, బెదిరించి మెడలో ఉన్న పుస్తెలతాడును బలవంతంగా తీసుకుని పరారయ్యాడు.

స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దుండగుడి పట్టుకోవడానికి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

పట్టణంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పోలీసు శాఖ గస్తీని పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.