ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ – గర్భిణి ప్రాణం బలిగొన్న ఆర్ఎంపి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆర్ఎంపీ మాఫియా అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా బాలాజీ ఆస్పత్రి పేరిట కేంద్రం నడుపుతున్న ఆర్ఎంపీ శ్రీనివాస్ లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లు నిర్వహిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
తాజాగా ఐదు నెలల గర్భిణి విజేతపై ఆయన లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేశారు. అయితే శస్త్రచికిత్సలో తీవ్ర సమస్యలు తలెత్తడంతో విజేత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతూ, ఆర్ఎంపీ నిర్లక్ష్యం కారణంగానే ప్రాణం పోయిందని ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణలు నిజమని తేలితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Post a Comment