జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – 14 మందికి గాయాలు
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో టవేరా కారు అదుపు తప్పి కల్వర్ట్ వద్ద బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 14 మందికి గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన గాయపడిన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులు హైదరాబాద్కు చెందినవారిగా గుర్తించారు. వేములవాడ దర్శనం అనంతరం కొండగట్టు దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment