బీరువా నిండా రూ.500 నోట్ల కట్టలు అక్రమ మైనింగ్ మాఫియాపై ఈడీ ఉక్కుపాదం
ఒడిశాలో అక్రమ మైనింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నిర్వహించిన భారీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గంజాం జిల్లాలో బొగ్గు, బ్లాక్ స్టోన్ అక్రమ మైనింగ్కు సంబంధించి సుమారు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు, మైనింగ్ మాఫియా నెట్వర్క్ను ఛేదించారు.
ప్రధాన వ్యాపారి నివాసంలో బీరువా నిండా రూ.500 నోట్ల కట్టలు, కోట్ల విలువైన లగ్జరీ కార్లు, అక్రమ ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కింపుకు బ్యాంక్ అధికారుల సహకారం తీసుకుంటున్నారు. ఈ దాడులు PMLA చట్టం కింద నమోదైన కేసుల ఆధారంగా జరిగాయి.
అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని భూములు, విలాసవంతమైన వస్తువులుగా మార్చినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. మైనింగ్ వ్యాపారులతో పాటు వారి భాగస్వాములు, సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగాయి. డిజిటల్ ఆధారాల ఆధారంగా మరింత లోతైన విచారణ చేపట్టనున్నట్లు ఈడీ వెల్లడించింది.

Post a Comment