బోరబండలో యువతి దారుణ హత్య… నగరంలో కలకలం
హైదరాబాద్, జనవరి 12: హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రాంతంలో మరో యువతి దారుణ హత్యకు గురైంది. తనతో సరిగ్గా మాట్లాడటం లేదనే అనుమానంతో ఓ యువకుడు యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనతో నగరంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రారంభంలో సాధారణంగా మాట్లాడుకున్న ఇద్దరి మధ్య కాలక్రమేణా సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం ఖనీజ్ ఫాతిమా బంజారాహిల్స్లోని పబ్ను విడిచి, బోరబండ పరిధిలోని ఊర్వశీ బార్కు ఉద్యోగం మారింది. ఈ నేపథ్యంలో ఆమె జహీర్తో మాట్లాడటం తగ్గించిందని పోలీసులు తెలిపారు.
ఫోన్ కాల్స్కు కూడా సరిగా స్పందించకపోవడంతో, జహీర్ ఆమె తనను ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతోందని, నిర్లక్ష్యం చేస్తోందని అనుమానించాడు. ఈ అనుమానమే క్రమంగా ద్వేషంగా మారినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామని చెప్పి యువతిని పిలిచిన జహీర్, మాటల మధ్యలోనే ఆమెపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు.

Post a Comment