భూపాలపల్లి జిల్లాలో బైక్ ను ఢీకొన్న ఆర్డీవో వాహనం ఇద్దరి పరిస్థితి విషమం
భూపాలపల్లి జిల్లాలో బైక్ ను ఢీకొన్న ఆర్డీవో వాహనం ఇద్దరి పరిస్థితి విషమం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల – భూపాల పల్లి జాతీయ రహదారి కొంపల్లి క్రాస్ వద్ద మంగళ వారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ వైపు నుండి భూపాలపల్లి వైపు వస్తున్న భూపాలపల్లి ఆర్డీవో వాహనం ద్విచక్ర వాహనా న్ని వేగంగా ఢీకొట్టింది.
దీంతో ద్విచక్ర వాహనంపై వున్న పిల్లోనిపల్లికి చెందిన పర్శ సంపత్, కొంపల్లికి చెందిన సడాలా ఎల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషంగా ఉంది.
క్షతగాత్రులను భూపాలపల్లి జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గణపురం ఎస్సై సాంబమూర్తి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు...

Post a Comment