నర్సింగ్ సిబ్బంది సేవలు మరువలేనివి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనదని, నర్సింగ్ సిబ్బంది అందిస్తున్న సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఐ.ఎం.ఎ. హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగోన్నతి పొందిన నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1, గ్రేడ్-2, మరియు హెడ్ నర్సులకు అభినందనలు తెలిపిన సందర్భంగా ఆయన ప్రసంగించారు.
"నర్సింగ్ సిబ్బంది రోగులకు సేవలందించడంలో, అలాగే వైద్యుడికి రోగికి మధ్య అనుసంధానంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా, రోగికి వైద్య సేవలందించడంలో వారు చూపే కృషి ప్రశంసనీయం," అని కలెక్టర్ అన్నారు. వృత్తిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తాను సంతోషంగా ముందుంటానని, వారికి తన పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, టివివిపి ఆసుపత్రుల సూపరింటెండెంట్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ సునీల్ మజ్నేకర్, డాక్టర్ హర్షవర్ధన్, మరియు జి.జి.హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment