రామవరం, మాదిగ సంక్షేమ సంఘం సమావేశంలో నేతల పిలుపు
ఎస్సీ వర్గీకరణ ఉద్యమం న్యాయమైనది, ధర్మమైనది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పట్టణంలో మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు వ్యక్తమైంది. ప్రఖ్యాత విద్యావేత్త, అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత సిద్దెల రవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ప్రజాస్వామ్య, అభ్యుదయ, పలు సామాజిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా కొనసాగుతున్న శాంతియుత, రాజ్యాంగబద్ధమైన ఉద్యమం తెలుగు రాష్ట్రాల్లో సామాజిక న్యాయానికి దిక్సూచి అని అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమం పలు సామాజిక సమస్యలపై ప్రభుత్వాలను కదిలించి అనేక మార్పులను తీసుకువచ్చిందని గుర్తు చేశారు.
ఈ సమావేశం, ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మరింత బలాన్నిచ్చిందని సంఘ నాయకులు తెలిపారు.

Post a Comment