-->

నేటి నుంచి హైదరాబాద్‌లో బాణాసంచా పై కఠిన నిషేధం

నేటి నుంచి హైదరాబాద్‌లో బాణాసంచా పై కఠిన నిషేధం

సీపీ సీవీ ఆనంద్ స్పష్టీకరణ

హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడంపై కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పెళ్లిళ్లు, పండుగలు, షాపుల ప్రారంభోత్సవాలు వంటి సందర్భాల్లో బాణాసంచా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

నిషేధానికి కారణం దేశంలో నెలకొన్న పరిస్థితులు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో యుద్ధ వాతావరణం ఏర్పడటంతో పాటు నగరంలో భద్రతా చర్యలు ముమ్మరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బాణాసంచా శబ్దాలు పేలుళ్లుగా అన్వయించబడే అవకాశం ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై సీరియస్ హెచ్చరికలు

బాణాసంచా అమ్మేవారిపై కూడా పోలీసు శాఖ గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి బాణాసంచా కాల్చితే జైలుశిక్ష కూడా విధించబడవచ్చని పోలీసుల హెచ్చరిక. ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో బాణాసంచా శబ్దాలు అత్యవసర పరిస్థితులుగా భావించబడే ప్రమాదం ఉందని సీపీ తెలిపారు.

నగర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సీపీ సీవీ ఆనంద్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ప్రజలకు భరోసా – అనుమానాస్పదులపై నిఘా

ప్రజలు ఎలాంటి బయపడ్డ అవసరం లేదని, పోలీసులు పరిస్థితిని పక్కాగా నియంత్రణలో ఉంచుతున్నారని సీపీ భరోసా ఇచ్చారు. అలాగే నగరంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఈ నిషేధం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతుంది.

Blogger ఆధారితం.