-->

మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

 

మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్, మహా న్యూస్ ఛానెల్ కార్యాలయంపై జరిగిన దాడిని టీఎల్పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను ఆయన "పత్రికా స్వేచ్ఛపై జరిగిన హేయమైన చర్య"గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మాధ్యమాలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, విలువలకు విరుద్ధంగా జరగుతున్న ఈ విధమైన దాడులను తాము ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు.

మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “ఒకవేళ మీడియా ప్రసారాలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే, వాటిని తెలియజేసేందుకు చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. మీడియా సంస్థలపై ఈ రకమైన దాడులు ప్రజాస్వామ్యాన్ని హీనపరిచే చర్యలుగా పరిగణించాలి. ఇది తగదు, సహించదగిన పరిణామం కాదు,” అని అన్నారు.

దాడికి పాల్పడిన వ్యక్తులపై వెంటనే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. “ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలంటే, నిందితులను గుర్తించి వారికి తగిన శిక్ష విధించాలి,” అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చట్టబద్ధమైన మార్గాల్లోనే అసమ్మతిని వ్యక్తపరచాలని ప్రజలకు సూచించారు.

Blogger ఆధారితం.