రాజ్భవన్లో ముగ్గురు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మరోసారి విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నూతనంగా ముగ్గురు మంత్రులను తన మంత్రివర్గంలోకి చేర్చుకుంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ వేంకటస్వామి, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వీరిని అభినందిస్తూ, తమ కేబినెట్లోకి వారికి స్వాగతం పలికారు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సామాజిక న్యాయానికి పెద్దపీట
ఈ విస్తరణలో ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మాల వర్గానికి చెందిన గడ్డం వివేక్, మాదిగ వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రిత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా సామాజిక న్యాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంతకుముందు మంత్రిగా ఉన్న సీతక్క ఆదివాసీ(ST) వర్గానికి చెందినవారు కాగా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా అదే వర్గానికి చెందిన రామచంద్రునాయక్కు లభించడం విశేషం. తొలిసారిగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి గెలిచిన రామచంద్రునాయక్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
బీసీలకు మంచి ప్రాతినిధ్యం
ఈ విస్తరణలో బీసీ వర్గానికి చెందిన మూడో వ్యక్తిగా వాకిటి శ్రీహరి కేబినెట్లోకి వచ్చారు. దీంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీలలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఇది బీసీలకు ప్రాధాన్యతనిచ్చిన నిదర్శనంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రెడ్లకు నిరాశ
ఈసారి కేబినెట్ విస్తరణలో రెడ్లకు ప్రాతినిధ్యం లభించకపోవడం గమనార్హం. అయితే ఇప్పటికే కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు మంత్రులుగా కొనసాగుతున్నారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులలో ఈ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Post a Comment