-->

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి


టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ని గోవా గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖపట్నం జిల్లాకు చెందిన అశోక్ గజపతి రాజు రాజకీయంగా విశేష అనుభవం కలిగిన నాయకుడు. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా సేవలందించిన ఆయన, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నేతగా కొనసాగుతున్నారు.

ఈ నియామకం ద్వారా కేంద్రం నుంచి టీడీపీకి మరింత ప్రాధాన్యం లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్‌గా ఆయన పాలన అనుభవం గోవా రాష్ట్రానికి మేలు చేస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.


Blogger ఆధారితం.