కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం... డీఎస్పీ మహేష్ బాబు గుండెపోటుతో మృతి
కరీంనగర్: పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డీఎస్పీగా పని చేస్తున్న మహేష్ బాబు అనూహ్యంగా గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం హుజురాబాద్ ఏసిపిగా విధులు నిర్వర్తిస్తున్న మాధవి భర్త అయిన మహేష్ బాబు, హుజురాబాద్లో ఆమెను కలవడానికి వచ్చిన సందర్భంలో ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్కు గురయ్యారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
మహేష్ బాబు మృతిచెందిన వార్తతో పోలీసులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన భార్య మాధవికి ఆత్మీయంగా దగ్గరుండే మహేష్ బాబు మృతి, పోలీస్ శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీస్ శాఖలో అత్యంత సమర్థవంతంగా పనిచేసిన ఒక విలక్షణ అధికారిని కోల్పోవడం తీవ్ర విషాదకరమని అందరూ పేర్కొన్నారు. మహేష్ బాబు ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
Post a Comment