-->

H-1B వీసాదారులకు షాక్.. 2027కి వాయిదా పడ్డ ఇంటర్వ్యూ తేదీలు!

H-1B వీసాదారులకు షాక్.. 2027కి వాయిదా పడ్డ ఇంటర్వ్యూ తేదీలు!


భారత్‌లో వీసా స్టాంపింగ్ కోసం వచ్చి చిక్కుకుపోయిన వేలాది మంది నిపుణులు సోషల్ మీడియా వెరిఫికేషన్‌తో తీవ్ర జాప్యం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో భారతీయ టెక్కీలు

అమెరికాలో పనిచేస్తున్న భారతీయ H-1B వీసాదారులకు ఊహించని షాక్ తగిలింది. వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన వేలాది మంది నిపుణులు ఇక్కడే చిక్కుకుపోయారు. వారి వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లు ఏకంగా 2027 సంవత్సరానికి వాయిదా పడటం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

సాధారణంగా కొన్ని రోజుల్లో పూర్తయ్యే వీసా స్టాంపింగ్ ప్రక్రియ, ఇప్పుడు ఏడాదికి పైగా ఆలస్యం కావడంతో వారి ఉద్యోగాలు, కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు తమ సంస్థల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

సోషల్ మీడియా పరిశీలనతో జాప్యం

2025 డిసెంబర్ మధ్య నుంచి అమెరికా యూఎస్ కాన్సులేట్లు కొత్త భద్రతా నిబంధనలను అమలు చేస్తున్నాయి. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఒక్కో దరఖాస్తుకు అదనంగా 20–30 నిమిషాల సమయం పడుతుండటంతో, రోజువారీగా నిర్వహించే ఇంటర్వ్యూల సంఖ్య భారీగా తగ్గిపోయింది.

2026 అపాయింట్‌మెంట్లు కూడా 2027కి

2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన వారికి కూడా తాజాగా 2027 ఏప్రిల్, మే నెలలకు తేదీలు మార్చినట్లు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. దీంతో వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన ఉద్యోగులు అమెరికాలో ఉన్న తమ కుటుంబాలు, పిల్లలకు దూరమయ్యారు.

ఆర్థిక, మానసిక ఒత్తిడి

అమెరికాలో ఇళ్ల అద్దెలు, లోన్లు, ఇతర బిల్లులు చెల్లిస్తూనే భారత్‌లో నిరీక్షించాల్సి రావడంతో బాధితులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.

న్యాయవాదుల హెచ్చరిక

ఈ పరిస్థితుల్లో అత్యవసరం అయితే తప్ప వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు ప్రయాణించవద్దని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు సూచిస్తున్నారు. ప్రస్తుతం 2027 వరకు సాధారణ ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది భారతీయ నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793