-->

2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ

 

2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్.జి.ఐ.ఏ) పోలీస్ అవుట్‌పోస్ట్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సంపాతి కనకయ్య మరియు ఎస్‌ఐ యు.కె. సిద్ధేశ్వర్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ఒక కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి, అలాగే ఫిర్యాదుదారుని కుటుంబ సభ్యులను అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ. 5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో భాగంగా రూ. 2 లక్షలు స్వీకరిస్తుండగా తెలంగాణ అవినీతినిరోధకశాఖ (ACB) అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అరెస్టు అనంతరం ఇన్‌స్పెక్టర్ కనకయ్య నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ. 33,97,000 నగదు, అలాగే పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రజలకు ACB సూచనలు

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని ACB అధికారులు ప్రజలను కోరుతున్నారు.

  • టోల్ ఫ్రీ నంబర్: 1064
  • వాట్సాప్: 9440446106
  • ఫేస్‌బుక్: Telangana ACB
  • ఎక్స్ (Twitter): @TelanganaACB
  • వెబ్‌సైట్: acb.telangana.gov.in

ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793