అమరవీరుల స్తూపంపై పోస్టర్ల వివాదం… వెంటనే స్పందించిన నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో అమరవీరుల స్తూపానికి అవమానం జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పట్టణ నడిబొడ్డున బస్టాండ్ సమీపంలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు “హిందూ సమ్మేళనం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు అతికించడం వివాదాస్పదంగా మారింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే హిందూ సమ్మేళనం నిర్వాహకులు స్పందించారు. స్తూపంపై అతికించిన పోస్టర్లను తక్షణమే తొలగించి, ఆ ప్రదేశాన్ని నీటితో శుభ్రం చేశారు.
అమరవీరుల స్మారక స్థలానికి ఎలాంటి అవమానం జరగకూడదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. పోస్టర్లు అతికించే కూలీలకు తెలియక అతికించ్చారని నిర్వాహకులు అన్నారు.

Post a Comment