-->

జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం… సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎలా చేయాలి? పూర్తి స్టెప్-బై-స్టెప్ గైడ్

జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం… సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎలా చేయాలి? పూర్తి స్టెప్-బై-స్టెప్ గైడ్


హైదరాబాద్, ఏప్రిల్ 27: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన-2027 ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా మొదటి దశ ప్రారంభమైంది. ఏప్రిల్ 1 నుంచి ఇళ్ల జాబితా మరియు హౌజింగ్ సెన్సస్ (HLO) కొనసాగుతుండగా, ఈసారి మొదటిసారిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ (Self Enumeration) విధానాన్ని ప్రవేశపెట్టింది.

తెలంగాణలో ఈ స్వీయ గణన కార్యక్రమం ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కొనసాగనుంది. డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ జనగణనలో ప్రజలు నేరుగా పాల్గొనే అవకాశం కల్పించడం విశేషం.


అసలేంటి సెల్ఫ్ ఎన్యుమరేషన్?

సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది ఒక సురక్షితమైన వెబ్ ఆధారిత విధానం. దీని ద్వారా పౌరులు తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చు.
ఇది 16 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండగా, మొత్తం ప్రక్రియ పూర్తి చేయడానికి సుమారు 15–20 నిమిషాలు పడుతుంది.

ఎన్యుమరేటర్ ఇంటికి రాకముందే ప్రజలు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.


సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఎలా చేయాలి? (Step-by-Step Process)

👉 ఈ స్టెప్స్ ఫాలో అవండి:

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://se.census.gov.in ఓపెన్ చేయండి.
  2. “Self Enumeration (HLO) Login” పై క్లిక్ చేయండి.
  3. మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసి, Captcha ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి.
  4. Welcome పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయండి.
  5. మీ మొబైల్‌కు వచ్చిన OTP ఎంటర్ చేసి Verify చేయండి.
  6. మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
  7. జిల్లా, గ్రామం/పట్టణం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయండి.
  8. మొబైల్‌లో Location ON చేసి, మీ ఇంటి లొకేషన్‌ను మ్యాప్‌లో గుర్తించండి.
  9. ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
  10. అన్ని వివరాలను Preview చేసి Submit చేయండి.
  11. సబ్మిట్ చేసిన తర్వాత “H” తో ప్రారంభమయ్యే 11 అంకెల SE ID వస్తుంది.
  12. ఆ SE ID ను సేవ్ చేసుకుని ఉంచాలి (SMS/Email ద్వారా కూడా వస్తుంది).
  13. తరువాత ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్‌కు ఆ SE ID చూపిస్తే ధృవీకరణ పూర్తవుతుంది.

ముఖ్య సూచనలు

  • ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలి
  • వివరాలు తప్పుగా ఇస్తే తరువాత సమస్యలు రావచ్చు
  • SE ID చాలా ముఖ్యమైనది — తప్పకుండా సేవ్ చేసుకోండి

డిజిటల్ యుగానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానం ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. ఇంటి వద్ద నుంచే సులభంగా జనగణనలో పాల్గొనే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793