ఇద్దరు బీహార్ కూలీల అనుమానాస్పద మృతి.. హత్యా? ప్రమాదమా? దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఇద్దరు బీహార్ కూలీల అనుమానాస్పద మృతి.. హత్యా? ప్రమాదమా? దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
కోదాడ, జూన్ 27: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఇద్దరు బీహార్కు చెందిన కూలీలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్ (22), శివాజీ (21)గా గుర్తించారు. వీరిద్దరూ కోదాడ పరిసర ప్రాంతంలోని ఓ రైస్ మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నారు.
జాతీయ రహదారి పక్కన ఇద్దరి మృతదేహాలు కనిపించగా, వాటి సమీపంలో వారి దుస్తులు, ద్విచక్ర వాహనం కూడా ఉండటంతో ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలన చేపట్టి ఆధారాలను సేకరించారు.
ఈ మరణాలు ప్రమాదవశాత్తు జరిగాయా? లేక హత్యకు గురయ్యారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణాలకు గల అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంఘటన కోదాడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Post a Comment